GURU PURNIMA CELEBRATION JULY 29 2026
జ: ఆహారం జీర్ణమైనప్పుడు దాని సూక్ష్మాంశం మనసుకు చేరుతుంది. మనసే విష్ణువు — అంటే చైతన్యం. కాబట్టి ఆహారాన్ని విష్ణువుకు హవిస్సుగా అర్పించినట్లు, మౌనంగా, శాంతచిత్తంతో, సాత్విక ఆహారాన్ని భుజించాలి. అప్పుడే బుద్ధిశక్తి పెరుగుతుంది.
జ: జఠరంలో నాలుగు భాగాలలో రెండు భాగాలు ఘన పదార్థాలతో, మూడవ భాగం నీటితో నింపి, నాల్గవ భాగం వాయు సంచారానికి ఖాళీగా వదలాలి. ఇదే సరైన ఆహార పరిమాణం. ఎక్కువైనా, తక్కువైనా హాని.
జ: అవును! అధిక నీరు జీర్ణరసాలను పలుచన చేసి జీర్ణశక్తిని తగ్గిస్తుంది. ఆమ్లాలు పెరిగి దాహం మరింత ఎక్కువవుతుంది. ఇడా నాడిని అడ్డగించి మెదడుకు రక్తప్రసరణ తగ్గిస్తుంది — తమస్ (బుద్ధి మాంద్యం) కలుగుతుంది. ఆయుర్వేదం దీన్ని ‘Water Intoxication’ అంటుంది.
జ: చెక్కుపై విలువ రాసి ఉంటుంది, కానీ అది వాస్తవ డబ్బుగా మారాలంటే బ్యాంకు సహాయం కావాలి. అలాగే ఆహారంలో శక్తి ఉంటుంది, కానీ అది మనకు చేరాలంటే జఠరాగ్ని బాగా పని చేయాలి. ప్రాణాయామంతో జఠరాగ్నిని క్రమంగా ఉంచినప్పుడే ఆహారం సరిగా జీర్ణమవుతుంది.
జ: సాత్విక ఆహారం తాజా, పోషకమైనది — ఆయుష్షు, ఆరోగ్యం, ఆనందం పెంచుతుంది. రాజసిక ఆహారం కారం, పులుపు, ఉప్పు అధికంగా ఉండేది — మనసులో అశాంతి, రోగాలు కలిగిస్తుంది. తామసిక ఆహారం పాచిపోయిన, దుర్వాసన వేసే ఆహారం — మనసులో అజ్ఞానం, సోమరితనం కలిగిస్తుంది.